వంశీని పరామర్శించిన జగన్


Send us your feedback to audioarticles@vaarta.com


మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్ విజయవాడ చేరుకున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసుకు సంబంధించి నమోదైన అనుబంధ కేసులో వల్లభనేని వంశీ అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈరోజు వంశీని పరామర్శించారు జగన్.
గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడులో సాక్ష్యుల్ని వల్లభనేని వంశీ బెదిరించారని, కిడ్నాప్ చేయించారనే ఆరోపణలపై ఆయన అరెస్ట్ జరిగింది. జైళ్లోనే వంశీతో ములాఖత్ అయిన జగన్, అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
జగన్ వెంట కొడాలి నాని, పెర్ని నాని, తలశిల రఘురాం, వంశీ భార్య పంకజశ్రీ ఉన్నారు. అయితే కొడాలి నాని, పేర్ని నానిని మాత్రం జైళ్లోకి అనుమతించలేదు. జైలు వెలుపల మీడియాతో మాట్లాడారు జగన్. వంశీ ఏ తప్పు చేయలేదని అన్నారు. కుట్రలో భాగంగానే ఆయన్ను ఇరికించారని ఆరోపించారు.
రేపు (19వ తేదీ) వైయస్ జగన్ గుంటూరులో పర్యటించబోతున్నారు. రేపు ఉదయం 10.30 గంటల ప్రాంతంలో గుంటూరు మిర్చి యార్డ్కు చేరుకుని.. గిట్టుబాటు ధర రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మిర్చి రైతులతో మాట్లాడతారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments