ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన టీడీపీ


Send us your feedback to audioarticles@vaarta.com


ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో తెలుగుదేశం పార్టీలో ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఓవైపు నామినేషన్ కు గడువు దగ్గర పడుతున్నప్పటికీ, అధినేత చంద్రబాబు ఇంకా జాబితా ప్రకటించపోవడంతో అందర్లో ఒకటే టెన్షన్.
రికార్డ్ స్థాయిలో ఈసారి నాలుగు స్థానాలకు టీడీపీ తరఫున 25 మంది ఆశావహులు ఉండడంతో చంద్రబాబు ఒకింత ఒత్తిడికి లోనయ్యారు. ఎంపికకు కాస్త టైమ్ తీసుకున్నారు. ఎట్టకేలకు అభ్యర్థుల తుది జాబితా ప్రకటించారు.
కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడుకు ఈసారి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు. వీళ్లంతా ఎమ్మెల్సీలుగా మండలిలో అడుగుపెట్టబోతున్నారు. కూటమి ఎమ్మెల్యేలంతా సంయుక్తంగా ఈ ముగ్గుర్ని గెలిపించుకోబోతున్నారు.
వెనకబడిన వర్గాల్ని ఆదరించడంలో ఎప్పుడూ ముందుండే తెలుగుదేశం పార్టీ ఈసారి కూడా అదే పని చేసింది. బీసీ, ఎస్సీ వర్గాలకే ఎమ్మెల్సీ పదవుల్ని కట్టబెట్టింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments