close
Choose your channels

ఎన్టీఆర్ ట్రస్ట్ కు పవన్ విరాళం

Monday, February 17, 2025 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎన్టీఆర్ ట్రస్ట్ కు పవన్ విరాళం

షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్రను పూర్తి చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నేరుగా యుఫోరియా మ్యూజికల్ నైట్ కు హాజరయ్యారు. తలసీమియా బాధితుల కోసం ఫండ్ రైజ్ చేసేందుకు ఈ మ్యూజికల్ నైట్ ఏర్పాటుచేశారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు అంతా టికెట్ తీసుకొని ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఓ మంచి పనికి తమవంతు సహాయ సహకారాలు అందించారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం టికెట్ తీసుకోలేదు. ఫ్రీగా ఈవెంట్ కు వచ్చేశారు.

తలసీమియా బాధితుల కోసం ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి ఫ్రీగా రావడం పట్ల చాలా గిల్టీగా ఉందన్నారు పవన్ కల్యాణ్. అందుకే తన వంతుగా ఎన్టీఆర్ ట్రస్ట్ కు 50 లక్షల విరాళాన్ని అందిస్తున్నట్టు ప్రకటించారు.

ఈ సందర్భంగా బాలకృష్ణతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు డిప్యూటీ సీఎం. బాలకృష్ణను ఎప్పుడు కలిసినా 'సర్' అని పిలవాలనిపిస్తుందని, ఆయన మాత్రం బాలయ్య అని పిలవమని అడుగుతుంటారని గుర్తుచేసుకున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment