తూర్పుగోదావరి జిల్లాలో పవన్, చిరు టూర్.. ఫ్యాన్స్కు పండగే..!!


Send us your feedback to audioarticles@vaarta.com


తూర్పుగోదావరి జిల్లాలో మెగాస్టార్ చిరంజీవి, పవర్స్టార్ పవన్కల్యాణ్ పర్యటించనున్నారు. తొలుత శుక్రవారం రాజమండ్రికి రానున్నారు చిరంజీవి. శనివారం పవన్ పర్యట వుంటుంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపడుతుండగా, అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాజమండ్రిలోని అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాలలో జరిగే పలు కార్యక్రమాల్లో మెగాస్టార్ పాల్గొంటారు. అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కళాశాల ఆవరణలో విగ్రహావిష్కరణ చేస్తోంది మెగా ఫ్యామిలీ. ఈ నేపథ్యంలో చిరంజీవికి ఘనస్వాగతం చెప్పేందుకు అభిమానులు భారీగా తరలిరానున్నారు.
మరోవైపు శనివారం జిల్లాలో పర్యటించనున్నారు జనసేన అధినేత, పవన్ కల్యాణ్. అక్టోబర్ రెండో తేదీన రాజమండ్రిలో పవన్ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు జనసేన నాయకులు. రోడ్ల శ్రమధానంలో భాగంగా ధవళేశ్వరం బ్యారేజ్కు రానున్నారు జనసేనాని. రోడ్ల దుస్థితి పరిశీలించి శ్రమదానం చేయనున్నారు పవన్. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే జనసేన నాయకులు జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. అటు పవన్ శ్రమదానం నేపథ్యంలో జనసైనికులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. అయితే పవన్ శ్రమదానం కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై జనసేనాని రియాక్షన్ ఎలా వుంటుందో తెలియాల్సి వుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments