ఎమ్మెల్సీగా 'రాములమ్మ'.. కాంగ్రెస్ నిర్ణయం


Send us your feedback to audioarticles@vaarta.com


తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ఆ పార్టీ ఖరారు చేసింది. 4 స్థానాల్లో ఒక స్థానాన్ని మిత్రపక్షం సీపీఐకి కేటాయించింది. మిగిలిన 3 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. అందరూ ఊహించినట్టుగానే అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ దక్కింది.
ఈయనతో పాటు శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఖరారు చేశారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. తాజా అంచనాల ప్రకారం కాంగ్రెస్ ప్రకటించిన ముగ్గురు ఎమ్మెల్యేల గెలుపు ఖాయం.
మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాల్లో 4 కాంగ్రెస్ కు రాగా, ఒకటి బీఆర్ఎస్ కు వెళ్లింది. మిగిలిన ఒకటి డైలమాలో ఉంది. ఈ ఎమ్మెల్సీ గెలవడానికి ఎంఐఎం కలిసిరావాలి. అయినప్పటికీ మరికొంతమంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. సరిగ్గా ఇక్కడే పార్టీ ఫిరాయింపుల అంశం తెరపైకి వస్తోంది.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఓట్లు వేస్తే మరో ఎమ్మెల్సీ కూడా హస్తంకే దక్కుతుంది. కానీ సుప్రీంకోర్టులో ఫిరాయింపులపై కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com