Congress Party:తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ బోణీ.. రెండు చోట్ల విజయం..


Send us your feedback to audioarticles@vaarta.com


తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశ్వారావుపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ.. బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై 28,358 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక ఇల్లందులోనూ కాంగ్రెస్ అభ్యర్థి కొరం కనకయ్య.. బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియ నాయక్పై 18 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఖమ్మంలో 10 స్థానాలకు గాను 2 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. ఒక చోట సీపీఐ ఆధిక్యంలో ఉంది.
ఇక మరో 63 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీఆర్ఎస్ అభ్యర్థులు 40 చోట్ల ముందంజలో ఉన్నారు. బీజేపీ 8 స్థానాల్లో లీడ్లో ఉన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ సీట్లలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది.
మరోవైపు ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని 8 స్థానాల్లో పోటీ చేసిన జనసేన ప్రభావం పెద్దగా కనిపించలేదు. కూకట్ పల్లిలో ఆ పార్టీ అభ్యర్థి ప్రేమ్ కుమార్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. మిగిలిన 7చోట్ల అయితే ఆ పార్టీకి డిపాజిట్లు కూడా వస్తాయో లేదో అనే పరిస్థితి నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments