రేవంత్ విమర్శ.. హరీశ్ ప్రతివిమర్శ


Send us your feedback to audioarticles@vaarta.com


ఎస్ఎల్బీసీ దుర్ఘటనకు సంబంధించి తనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల్ని, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తిప్పికొట్టారు. ఇంతకీ రేవంత్ రెడ్డి ఏమన్నారో ముందుగా చూద్దాం.
ఓవైపు దుర్ఘటన జరిగి 8 మంది చనిపోతే, మరోవైపు హరీశ్ రావు మాత్రం దుబాయ్ వెళ్లి ఎంజాయ్ చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తన పాస్ పోర్టులో ప్రయాణ వివరాల్ని హరీశ్ రావు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఆయన బయటపెట్టకపోతే, ప్రభుత్వం బయటపెడుతుందని అన్నారు.
దీనిపై హరీశ్ రావు ప్రతిస్పందించారు. తను దుబాయ్ వెళ్లింది క్రికెట్ మ్యాచ్ ఎంజాయ్ చేయడానికి కాదని, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూతురు పెళ్లి కోసం వెళ్లానని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉండి కూడా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి, ఎస్ఎల్బీసీకి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.
నిజాయతీ ఉంటే ఎస్ఎల్బీసీ ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి దోషులు ఎవరో తేల్చాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. సాంకేతిక అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా, పనులు ప్రారంభించి ప్రమాదానికి కారణమయ్యారని విమర్శించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com