39 సార్లు కాదు, 99సార్లు ఢిల్లీకి పోతా, తప్పేంటి?


Send us your feedback to audioarticles@vaarta.com


తనపై ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శల్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా తిప్పుకొట్టారు. ఇప్పటికి 39 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారంటూ బీఆర్ఎస్ విమర్శించగా.. అవసరమైతే 99 సార్లు వెళ్తా తప్పేంటని గట్టిగా ప్రశ్నించారు సీఎం.
తన పార్టీ అధిష్టానం ఢిల్లీలో ఉందని, నిధులు ఇవ్వాల్సిన కేంద్రం కూడా ఢిల్లీలో ఉందని, అలాంటప్పుడు ఢిల్లీ ఎన్నిసార్లు వెళ్లినా తప్పులేదన్నారు రేవంత్ రెడ్డి. బడ్జెట్ లో ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు పరిమితంగా ఉంటుందని, అందుకే కేంద్రాన్ని అడుగుతున్నామని అన్నారు.
మోదీ ఇచ్చిన హామీ మేరకే నిధులు అడుగుతున్నామని, తమవి గొంతెమ్మ కోర్కెలు కావని అన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి నిధులు రాకూడదని బీజేపీ ప్రయత్నిస్తోందని, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమని ప్రకటించారు. తెలంగాణకు అధిక నిధులు ఇచ్చినట్టు నిరూపిస్తే, విమర్శలు చేస్తున్న కిషన్ రెడ్డికి సన్మానం చేస్తామన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments