మనవడు దేవాన్ష్ తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు


Send us your feedback to audioarticles@vaarta.com


రాజకీయంగా ఆయన బిజీగా ఉంటారు. ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండదు. కానీ కుటుంబం కోసం ఎంతోకొంత సమయాన్ని కేటాయిస్తుంటారు చంద్రబాబు. తాజాగా మనవడు దేవాన్ష్ పుట్టినరోజు కోసం రాజకీయాల్ని కాసేపు పక్కనపెట్టారు.
దేవాన్ష్ ప్రతి పుట్టినరోజుకు తిరుపతి వెళ్లడం నారా కుటుంబం ఆనవాయితీ. ఈసారి కూడా అదే చేశారు. లోకేష్-బ్రహ్మాణి-దేవాన్ష్ తో కలిసి సతీసమేతంగా తిరుమల వెళ్లారు చంద్రబాబు. ఏటా ఇచ్చినట్టుగానే ఈ ఏడాది కూడా తిరుపతి వెంగమాంబ అన్నదాన సత్రానికి విరాళం ఇచ్చారు.
ప్రతి ఏటా అన్నదానానికి దేవాన్ష్ పేరిట 33 లక్షల రూపాయలు ఇవ్వడం చంద్రబాబుకు అలవాటు. అది ఒకరోజు భక్తుల అన్నదానానికి సమానం. అయితే ఈ ఏడాది మాత్రం ఆయన 44 లక్షల రూపాయలిచ్చారు. పెరిగిన ఖర్చుల వల్ల ఒకరోజు అన్నదానానికి ప్రస్తుతం 44 లక్షల రూపాయలు ఖర్చు అవుతోందంట. అందుకే అంత మొత్తాన్ని దేవాన్ష్ పేరిట విరాళంగా ఇచ్చారు ముఖ్యమంత్రి.
తన విరాళాన్ని టీటీడీకి చెక్కు రూపంలో అందించారు చంద్రబాబు. ఆ వివరాల్ని తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో డిస్ ప్లే బోర్డుల్లో ప్రదర్శించారు. ఎవరు విరాళం ఇచ్చినా ఇలా ప్రదర్శించడం తిరుమలలో ఆనవాయితీ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com