జగన్ కిరాయి మూకలతో వచ్చారు - బుద్ధా వెంకన్న


Send us your feedback to audioarticles@vaarta.com


మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. పిల్ల సైకో వంశీని పరామర్శించేందుకు పెద్ద సైకో వచ్చాడని ఆరోపించిన వెంకన్న.. ఒక పధకం ప్రకారం కిరాయి మూకలను తీసుకుని జగన్ విజయవాడ వచ్చారని, అయితే పోలీసులు ముందే పసిగట్టి ఎక్కడికక్కడ నిలువరించారని అన్నారు. పోలీసులు ఎక్కడున్నా వారి బట్టలు ఊడదీస్తానని చేసిన వ్యాఖ్యలు జగన్ నైజాన్ని మరోసారి బయట పెట్టాయన్నారు.
వల్లభనేని వంశీని కలిసి జగన్, నందిగం సురేష్ ను ఎందుకు జైళ్లో కలవలేదని ప్రశ్నించారు బుద్ధా వెంకన్న. అధికారంలో ఉండగా తొడలు కొట్టి, మీసం తిప్పి, జబ్బలు చరిచిన కొడాలి నాని.. జగన్ తో వచ్చి, జగన్ తోనే వెళ్లిపోయారని, ఎందుకంత భయమని ప్రశ్నించారు. గన్నవరంలో చంద్రబాబు నిలబెట్టిన వెంకట్రావు చేతిలో వల్లభనేని వంశీ, గుడివాడలో కొత్త అభ్యర్థి చేతిలో కొడాలి నాని ఓడిపోయినా ఇంకా సిగ్గురాలేదన్నారు.
వంశీ, నానీలను నిజంగా లోపల వేయాలంటే అధికారం వచ్చిన నెల రోజుల్లోనే జైలుకు పంపే వాళ్లమని, కానీ తమవి కక్షపూరిత రాజకీయాలు కావని అన్నారు. జగన్ హయాంలో పోలీసుల్ని వాడుకొని అక్రమ కేసులు పెట్టారని, తాము అలా చేయమని అన్నారు. చట్టబద్ధంగా వ్యవహరిస్తామన్నారు.
వంశీ ని పరామర్శించిన జగన్ చరిత్ర హీనుడిగా మిగిలారని.. అరాచకాలు, అల్లర్లు చేసేందుకే కార్యకర్తలు ను వెంటేసుకుని వచ్చారని విమర్శించారు బుద్ధా వెంకన్న.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments